
- సీఎం రేవంత్ రెడ్డితో అమిటీ వర్సిటీ చాన్స్లర్ అతుల్ చౌహాన్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ విద్యా రంగం అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డికి అమిటీ యూనివర్సిటీ చాన్స్లర్ అతుల్ చౌహాన్ తెలిపారు. గురువారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలోని ఆయనను అతుల్ చౌహాన్ కలిశారు. తెలంగాణలో తమ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగస్వాములవుతామని సీఎంకు చెప్పారు. మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా బోధనతో ఇప్పటికే అమిటీకి మంచి పేరు ఉందని.. తెలంగాణలో మరింతగా రాణించేందుకు కృషి చేస్తామని అతుల్ చౌహాన్ అన్నారు. ఆయన వెంట అమిటీ వర్సిటీ ప్రతినిధి రామచంద్రం కూడా ఉన్నారు.